వైఎస్ జగన్ బయోపిక్కు బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధం!
- IndiaGlitz, [Sunday,May 26 2019]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజకీయ అరగేంట్రం నుంచి జగన్ సీఎం అయ్యే వరకు ఆయన జీవితంలోని ప్రతీ విషయం ఎంతో ఆసక్తికరమైనదని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేపట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు.
యాత్ర-2..!
ఇవన్నీ అటుంచితే అతిపిన్న వయస్సులోనే జగన్ సీఎం కాబోతున్నారు. దీంతో జగన్పై బయోపిక్ తీయడానికి ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ డైరెక్టర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ పాదయాత్రపై ‘యాత్ర’ సినిమా తీసి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మహి వి. రాఘవ.. జగన్ పాదయాత్రపై.. ‘యాత్ర-2’ చేయడానికి సిద్దమవుతున్నట్లు ఏపీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన నాటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి.
సోనియా అవమానం.. రెడ్డి ప్రతీకారం..!
అయితే తాజాగా.. వైఎస్ జగన్ బయోపిక్ తీయడానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జగన్ జీవితం తెరకెక్కిస్తే ఓ అద్భుతమైన చిత్రం అవుతుందని ఆయన ఓ కథనంలో అభిప్రాయపడ్డారు. ఏపీలో కనీవినీ ఎరుగని రీతిలో ఫ్యాన్ గాలి వీయడం.. వైసీపీ విజయకేతనం ఎగరేయడంతో ‘డీపీ సతీష్’ అనే పాత్రికేయుడు ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకోసం జగన్పై ప్రత్యేక కథనం రాశారు. ఈ కథనానికి ‘సోనియా అవమానం.. రెడ్డి ప్రతీకారం, ఆంధ్రా శాపం: కాల్పనికతను మించిన ఇతివృత్తం జగన్ ప్రస్థానం పేరిట రాసిన ఆ కథనం జాతీయ మీడియాలో సంచలనమైంది.
త్వరలోనే జగన్ బయోపిక్..!
ఈ కథనాన్ని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయగా.. ఇందుకు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. జగన్ జీవితంపై తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కొచ్చంటూ రీ-ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన పలువురు తెలుగు రాష్ట్రాల నెటిజన్లు, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే పట్టాలు ఎక్కించండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కశ్వప్ మాటలు ట్వీట్కే పరిమితవుతాయా..? లేకుంటే షూటింగ్ దాకా వెళ్లి పట్టాలెక్కుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.