జగన్ బయోపిక్ పై బాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై.ఎస్.జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు స్థాయిని చేరుకోడానికి ఆయన పడ్డ కష్టం అసాధారణమైనది. జగన్ కుటుంబానికి సోనియా చేసిన అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్రశాపం.. కల్పిత కథను మించినది జగన్ ప్రస్థానం అంటూ ఓ పాత్రికేయుడు ఆంగ్ల పత్రికకు వ్యాసం రాశారు.
దాన్ని మరో జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. 'ఇదొక అద్భుతమైన చిత్రం. రూపొందడానికి ఎదురుచూస్తుంది' అంటూ ఆయన మెసేజ్ను పోస్ట్ చేశారు. అంటే ఈ బాలీవుడ్ దర్శక నిర్మాత జగన్ బయోపిక్ను తీస్తే జగన్ ఇక దేశ ప్రజలందరికీ చేరువైనట్లే. మరో పక్క 'యాత్ర' దర్శకుడు మహి వి.రాఘవ్, జగన్ పాదయాత్రను ఆధారంగా చేసుకుని 'యాత్ర 2' రూపొందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.