Akshay Kumar: మెట్రో రైలులో ప్రయాణించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

  • IndiaGlitz, [Friday,January 12 2024]

దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో ట్రాఫిక్ కష్టాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జెంట్ పని మీద సొంత వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల్లో రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే గంటల మేర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిందే. అదే ఇక వర్కింగ్ యావర్స్ టైంలో అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. అందుకే ట్రాఫిక్ కష్టాలను తప్పించేందుకు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. గమ్యస్థానాన్ని తక్కువ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు కూడా మెట్రోలో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar)మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. బ్లాక్ డ్రస్ వేసుకుని, తలకు బ్లాక్ టోపీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపించారు. ప్రముఖ నిర్మాత దినేష్‌ విజన్‌తో కలిసి సాధారణ ప్రయాణికుడిలా కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ ప్రయాణించారు. దీంతో పక్కనున్న వ్యక్తులు కూడా అక్షయ్ కుమార్‌ని గుర్తు పట్టకుండా ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. కానీ దూరంగా ఎవరో గుర్తు పట్టి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి.. ఇంత సింపుల్‌గా మెట్రోలో ప్రయాణికుల మధ్య ప్రయాణించడంపై అభిమానులతో పాటు నెటిజన్లు ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంతమంది ఏమో ముంబై ట్రాఫిక్ అలాంటిది మరి.. ఎవరైనా సరే మెట్రోలో ప్రయాణించాల్సిందే అని సెటైర్లు వేస్తున్నారు. కాగా గతంలో మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా మెట్రోలో ప్రయాణించారు. ఆయననకు ప్రయాణికులు గుర్తు పట్టడంతో వారికి సెల్పీలు ఇస్తూ ప్రయాణించారు. ఈ వీడియో కూడా తెగ వైరల్ అయింది.

ఇక అక్షయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుం స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింగం సిరీస్‌లో భాగంగా 'సింగం అగైన్' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది.

More News

పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి.

Hanuman Vs Adipurush: 'హనుమాన్' వర్సెస్ 'ఆదిపురుష్'.. ప్రశాంత్‌ వర్మ దెబ్బకు ఓం రౌత్ అబ్బా..

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(HanuMan) చిత్రం

వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 6 మంది ఎంపీలతో పాటు

BRS Party: మళ్లీ టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. పార్టీ ఉనికి కోసమేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ కారణాలపై అన్వేషిస్తోంది. దీంతో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పిదాలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.

YSRCP MPs: వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా సినీ ప్రముఖులు.. ఎవరంటే..?

వైసీపీలో మూడో జాబితా ఇంఛార్జ్‌ల మార్పుపై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయాలనుకున్న నియోజవకర్గాల నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని చర్చిస్తున్నారు.