అల్లు అర్జున్ సినిమాపై బాలీవుడ్ హీరో కామెంట్‌

  • IndiaGlitz, [Thursday,May 28 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి 2020 బాగా క‌లిసొచ్చింది. ఈయ‌న హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు హీరోల పేర్లు విన‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ ఓపెన్ అయ్యాడు. ఓ ఇంట‌రాక్ష‌న్‌లో ఆయన మాట్లాడుతూ తాను నెట్‌ఫ్లిక్స్‌లో అల వైకుంఠ‌పుర‌ములో సినిమా చూశానని, ఎట్టి పరిస్థితుల్లో తానే చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు చెప్పాడు. త‌న‌ను త‌ప్ప మ‌రో హీరోను ఆ పాత్ర‌లో ఊహించుకోలేపోతున్నాన‌ని కూడా కార్తీక్ ఆర్య‌న్ చెప్ప‌డం విశేషం.

ఇదే ఏడాదిలో బ‌న్నీ త‌న పాన్ ఇండియా చిత్రం పుష్ప‌ను కూడా స్టార్ట్ చేయ‌బోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఈ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు బ‌న్నీ రాబోతున్నారు. తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయి క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో బ‌న్నీ తొలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకుంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ర‌ష్మిక మంద‌న్నా ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

రీమేక్‌లో సూర్య‌, కార్తి

కొత్త కాన్సెప్ట్‌ల‌ను భాషా బేదం లేకుండాసినీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటార‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓటీటీ మాధ్య‌మాలు ఎక్కువైన నేటి రోజుల్లో సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాయి.

సమంతపై అభ్యంతరకర పోస్ట్.. పూజా హెగ్దే అకౌంట్ హ్యాక్!

ఇదేంటి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ పూజా హెగ్దే.. సమంతపై అభ్యంతర పోస్ట్ చేసిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును పోస్ట్ చేసిన విషయం వాస్తవమే కానీ చేసింది మాత్రం పూజా హెగ్దే కాదట.

'లాస్ట్ పెగ్' యాక్షన్ టీజర్ విడుదల

భారత్ సాగర్, యశస్విని రవీంద్ర హీరో హీరోయిన్లుగా వినూత్న కాన్సెప్టుతో వస్తోన్న లాస్ట్ పెగ్ చిత్రం. ఈ మూవీ మనిషి జీవితంలో జరిగే కాలానికి సంబంధించినది.

జగన్ కోసం తిరుమల కొండెక్కా.. కానీ మాట తప్పారు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్‌ పెద్దలు.. బాలయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదా!?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ తిరిగి ప్రారంభింపజేయాలని టాలీవుడ్ పెద్దలు నానా తంటాలే పడుతున్నారు.