చిరుకు ఓకే అన‌లేదు.. మ‌రి బాల‌య్య ఓకే అన్న‌ట్లేనా?

ఓ బాలీవుడ్ న‌టుడిని చిరంజీవి మ‌ల‌యాళ రీమేక్ లూసిఫ‌ర్ కోసం సంప్ర‌దిస్తే.. బిజీగా ఉన్నాను.. కాబ‌ట్టి చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ని కొన్ని రోజుల ముందు వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ బాలీవుడ్ న‌టుడు ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వివేక్ ఒబెరాయ్‌. ఇప్పుడు బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106వ చిత్రంలో న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణం బోయపాటి శ్రీను అనే అంటున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో వివేక్ ఒబెరాయ్ విన‌య విధేయ రామ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ప‌రిచ‌యంతోనే బాల‌య్య సినిమాలో న‌టించ‌డానికి బోయ‌పాటి ఒప్పించార‌ని టాక్‌.

సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్స్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. భారీ అంచ‌నాలున్నాయి. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరాగా క‌నిపిస్తార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో బోయ‌పాటి శ్రీను తెలిపారు. ద్వారర‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ తర్వాత షూటింగ్‌ను జ‌రుపుకోనుంది.

More News

‘వ‌కీల్‌సాబ్’ ట్రీట్ సిద్ధ‌మ‌వుతోందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

తెలంగాణకు భారీ ఆఫర్.. రూ.1200 కోట్ల పెట్టుబడికి మెడ్ ట్రానిక్స్ సిద్ధం

మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది.

సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. కరోనా పరీక్ష నిర్వహించగా..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి నిర్వహించిన పరీక్షల్లో

బీరుట్ ఘటన ఎఫెక్ట్.. భాగ్యనగర వాసుల్లో టెన్షన్ టెన్షన్..

హైదరాబాద్‌కు అమ్మోనియా నైట్రేట్ టెన్షన్ పట్టుకుంది. కీసర మండలం అంకిరెడ్డి పల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి.

‘నిశ్శ‌బ్దం’ రిలీజ్‌ విష‌యంలో  ప్రేక్ష‌కుల రెస్పాన్స్

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’.