గ్రీన్ ఇండియా ఛాలెంజ్: హైదరాబాద్‌లో మొక్కలు నాటిన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్

దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరిని కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ఎవరో ఒక ముగ్గురు సెలబ్రెటీలు ఖచ్చితంగా ప్రతి రోజూ మూడు మొక్కలు నాటుతూ మంచి కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు మురిసిపోతున్నారు. తాజాగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ భాగం పంచుకున్నారు.

ఆదివారం హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యువహీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్‌లను చూశాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్‌ను అందించిన టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని అభినందించారు. మనమంతా తప్పనిసరిగా మొక్కలు నాటాలని.. వాటిని బాధ్యతగా పెంచాలని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతామని ఆయన అన్నారు. దీనిని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని అమీర్‌ఖాన్ పిలుపునిచ్చారు.
 

More News

వేద‌వ్యాస్‌గా బ్ర‌హ్మానందం 'పంచంతంత్రం' సినిమాలో ఆయ‌న ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

తెలుగు తెర‌పై ఎన్నో విల‌క్షణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులకు న‌వ్వుల‌ను పంచిన హాస్య‌బ్ర‌హ్మ బ్రహ్మానందం  పంచంతంత్రం సినిమా కోసం క‌థ‌కుడిగా

సావిత్రి w/o స‌త్య‌మూర్తి ట్రైల‌ర్‌ను విడుద‌ల‌ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ

అర‌వై ఏళ్ల సావిత్రి త‌న భ‌ర్త స‌త్య‌మూర్తి త‌ప్పిపోయాడ‌ని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆన‌వాలుగా ఇర‌వై ఏళ్ల యువ‌కుడి ఫొటో ఇచ్చి ఇత‌నే త‌న భ‌ర్త అని చెబుతుంది.

కోర మీసంతో డిఫరెంట్ లుక్‌లో తేజ సజ్జ: ఆకట్టుకుంటున్న 'హను-మాన్' గ్లిమ్స్‌

బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి..ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు ఈ కుర్రాడు హీరోగా మారి సినిమాలతో అలరిస్తున్నాడు.

'లాల్‌ సింగ్‌ చద్దా'కు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. కరీనా కపూర్ జంటగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

కోటు వేసుకుంటే 'బరువు' తెలిసింది.. డాక్టర్ పాత్రపై రకుల్ ఎమోషనల్

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇక్కడ ఆఫర్లు లేవు. అయితే ఈ అమ్మడికి అదృష్టం కొంచెం ఎక్కువగా వుండటంతో బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.