కంగ‌నా ఆఫీస్ కూల్చివేత కేసుపై హైకోర్టు తీర్పు

  • IndiaGlitz, [Friday,November 27 2020]

బాంద్రాలోని కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బీఎంసీ(బ్రిహాన్ ముంబై కార్పొరేష‌న్‌) అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా కూల్చివేయ‌డాన్ని త‌ప్ప‌బ‌డుతూ కంగ‌నా ర‌నౌత్ ముంబై కోర్టులో కేసు వేసింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉన్న ఆఫీసును విరుద్ధంగా ఎలా కూల్చివేశారంటూ కోర్టు అధికారుల తీరుని త‌ప్పు ప‌ట్టింది. కంగ‌నాకు జ‌రిగిన న‌ష్టాన్ని తిరిగి చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై కంగనా విజ‌యం సాధించింద‌ని అంటున్నారు.

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసులో ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ అప్ప‌ట్లో సెన్సేష‌ల్ కామెంట్స్ చేసింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ తీరుని ద‌య్య‌బ‌ట్టింది. ముంబైని పీఓకేతో పోల్చింది. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోపం వ‌చ్చింది. బాంద్రాలోని ఆమె ఆఫీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఆరోపిస్తూ బీఎంసీ కూల్చివేత‌ను ప్రారంభించింది. ఆ స‌మ‌యంలో కంగ‌నా కోర్టు మెట్ల‌క్క‌డంతో హైకోర్టు కూల్చివేత‌పై స్టే విధించింది. క‌క్షతోనే ప్ర‌భుత్వం త‌న ఆఫీసును కూల్చివేసింద‌ని, త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ కంగనా కేసు వేసింది. కేసును విచారించిన కోర్టు కంగ‌నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

More News

అరేబియా సముద్రంలో కుప్పకూలిన మిగ్‌-29కే శిక్షణ విమానం

అరేబియా సముద్రంలో మిగ్‌-29కే శిక్షణ విమానం కుప్పకూలింది. గురువారం రాత్రి గోవాలో ఈ దుర్ఘటన జరిగింది.

ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ .. కాస్త వెన‌క్కి..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ఓ సినిమాను నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

‘పుష్ప’ సినిమాలో విల‌న్స్ ఎంత మందో తెలుసా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది.