'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,September 22 2020]

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటెర్టైనెర్ మూవీ బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది. టైటిల్ తోనే అటు మాస్ ఆడియెన్స్ లో ఇటు క్లాస్ అడియెన్స్ లో అనూహ్య స్పంద‌న తెచ్చుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఇక‌ ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ‌ర్ల‌ తెలిపారు.

షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడి తో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట. షకలక శంకర్ తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజగా గా విడుదల అయింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్ధం లో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్బంగా

దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ ... బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది డైరెక్టర్ గా నా తొలి సినిమా, ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీ తో తెర‌కెక్కించాము. షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.

నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్, సోమేశ్ ముచుర్ల‌ మాట్లాడుతూ.. కొత్త దర్సకుడు కుమార్ కోట, ఈ కథను చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిన డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలైట్ అవనున్నాయి అని తెలిపారు.

నటీనటులు .. షకలక శంకర్ , ప్రియ

More News

సోము వీర్రాజు అసలు హిందువేనా?: ఓవీ రమణ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఓవి రమణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

ఇవాళ నామినేషన్స్ పర్వం నడిచింది. చూస్తున్నంత సేపు.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా? అనిపించింది.

ఆరు పంటలకు మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం..

2021-22 సంవత్సరానికి గాను ఆరు రబీ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అలనాటి ప్రముఖ నటి సీత మృతి

అలనాటి ప్రముఖ నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత(87) నేడు కన్నుమూశారు.

దేశంలోనే తొలిసారిగా సరికొత్త యాప్‌ను రూపొందించిన ఏపీ పోలీస్ శాఖ ..

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా