close
Choose your channels

ఆ ఇద్దరూ సమ్మర్ నే టార్గెట్ చేశారు

Wednesday, January 31, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'జ‌యం'.. ప‌ద‌హారేళ్ళ క్రితం తెలుగు తెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన సినిమా పేరిది. ఆ చిత్రం.. క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన నితిన్‌కి ఎంత పేరు తీసుకువ‌చ్చిందో.. ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన గోపీచంద్‌కి కూడా అంతే పేరు తీసుకువ‌చ్చింది. ఆ సినిమా త‌రువాత గోపీచంద్ ఒక‌ట్రెండు సినిమాల్లో విల‌న్‌గా న‌టించినా.. తిరిగి క‌థానాయ‌కుడిగా సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సంవ‌త్స‌రం వేస‌వి 'జ‌యం' క‌థానాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడికి ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే..

ఈ ఇద్ద‌రి ల్యాండ్ మార్క్ మూవీస్ వేస‌విలోనే సందడి చేయనున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ 'పంతం' పేరుతో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మే 18న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇక ల‌వ‌ర్ బోయ్ నితిన్ కూడా ప్ర‌స్తుతం 25వ సినిమా చేస్తున్నాడు. 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా కూడా స‌మ్మ‌ర్‌కే రాబోతోంది. సో.. వేస‌విని టార్గెట్ చేసుకుని ఈ ఇద్ద‌రు క‌థానాయ‌కులు త‌మ 25వ చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నార‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.