close
Choose your channels

నిమ్స్‌లో జరగాల్సిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్

Tuesday, July 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. క్లినికల్ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి నిమ్స్‌లో ట్రయల్స్ జరగాల్సి ఉండగా.. ఐసీఎంఆర్ అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. రెండు మూడు రోజుల్లో ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫేస్ 1, ఫేస్ 2 కింద జరుగుతాయి. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని ఐసీఎంఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.