దుబాయ్, కువైట్‌ నుంచి వస్తూ.. ఇవి తీసుకొచ్చారో జైలుకే!

  • IndiaGlitz, [Friday,November 15 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. పొరపాటున కూడా ఇంటికొచ్చే టైమ్‌లో చిరుధాన్యాలను (కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఉధలు, అరికెలు) తీసుకురావొద్దు. ఒకవేళ తీసుకొచ్చారో అంతే సంగతులు.. అరెస్ట్ తప్పదు.. అంతేకాదు జైలు శిక్ష కూడా తప్పందండోయ్. ఇదిగో ఇటీవల ఓ సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి విషయంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన సంతోష్ రెడ్డి(37) కొంతకాలంగా దుబాయ్‌లోని అబుదాబిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇండియాకు వస్తూ వస్తూ దొరికింది కదా చాన్స్ అని.. చిరు ధాన్యాలను గట్టిగానే తీసుకొచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో ఊహించని షాక్ ఎదురవ్వడంతో అసలు విషయం తెలిసొచ్చింది.

తన లగేజీతో సహా ఎయిర్‌పోర్టులో చెకింగ్‌కు వెళ్లగా చిరుధాన్యాలను చూడగానే వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కుయ్యో మర్రో అని మొత్తుకున్నా కనీసం ఆ పోలీసులు లెక్కచేయలేదు. అంతేకాదు జైలు శిక్ష విధించించారు అక్కడి పోలీసులు. ఇదిలా ఉంటే.. కుమారుడు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమ బిడ్డను ఇండియాకు రప్పించాలంటూ ఇండియన్ ఎంబసీ వారిని సంప్రదిస్తున్నారు. కాగా.. పచ్చళ్లు, పప్పు దినుసులు, మాంసాహార పదార్ధాలు, కరివేపాకు, గసగసాలు, ఎండు కొబ్బరి, కూరగాయల విత్తనాలు, డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా తీసుకెళ్లే మందులపై నిషేధం ఉంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇండియాకు వచ్చే ముందు.. ఇలాంటివన్నీ తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

More News

స్పీడు మీదున్న విశాల్‌

యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ ఈ శుక్ర‌వారం 'యాక్ష‌న్‌' అనే చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కాగా.. ప్ర‌స్తుతం ఈ హీరో బ్రిస్టోల్‌లో ఉన్నాడు.

కార్తీ లేటెస్ట్‌ ఎమోషనల్‌ మూవీ ‘దొంగ’

యాంగ్రీ హీరో కార్తీ ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ చిత్రంతో ఎమోషనల్‌ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దొంగ’గా మరో ఘనవిజయాన్ని అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీ.

చిరూ.. ‘పునాదిరాళ్ల’కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని పట్టించుకోరూ..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు కొణిదెల చిరంజీవి. ఈయన ఇప్పటి వరకూ 151 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ..

వంశీ వర్సెస్ లోకేష్.. ఆ వెబ్‌సైట్లతో నాకేంటి సంబంధం!?

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్.. బాబుకు అంత సీన్ లేదు!

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని