మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు'.  సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాకు తొలి షెడ్యూల్‌ను కాశ్మీర్‌లో చిత్రీక‌రించారు. కాశ్మీర్ వంటి సెన్సిటివ్ ప్రాంతంలో చిత్రీక‌రించ‌డానికి యూనిట్ ప‌ర్మిష‌న్ తీసుకుంది. ప‌హ‌ల్‌గామ్ ప్రాంతంలో ఈ కాశ్మీర్ షెడ్యూల్‌ను చిత్రీక‌రించారు. అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే సెక్యూరిటీ రీజ‌న్స్ కార‌ణంగా ఉద‌యం ప‌ది నుండి సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు షూటింగ్ చేయ‌కూడ‌దు. దాంతో ఉద‌యం ఐదు గంట‌ల నుండి 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షూటింగ్‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ట‌. ఇక నిర్మాత‌లు సెంట్ర‌ల్ హోం మినిష్ట‌ర్ రాజ్‌నాథ్ సింగ్‌ను సంప్ర‌దించార‌ట‌. ఆయ‌న అనుమ‌తి ఇవ్వ‌డంతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ సెక్యూరిటీని ఇచ్చి యూనిట్‌కు ఎంత‌గానో హెల్ప్ చేశార‌ట‌.

'స‌రిలేరు నీకెవ్వ‌రు', మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం. ఈ సంక్రాంతికి విడుద‌ల కాబోతున్న ఈ సినిమా ఇప్ప‌టికే 75 శాతం సైగానే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాయి యూనిట్ వ‌ర్గాలు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి, ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను గ్రేట్ ఇండియా సంస్థ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది. మ‌హేశ్‌, అనీల్ రావిపూడి క్రేజీ కాంబినేష‌న్ కాబ‌ట్టి సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.