ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. హెల్త్ బులిటెన్ విడుదల

  • IndiaGlitz, [Monday,November 29 2021]

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్ధితిపై సికింద్రాబాద్‌ కిమ్స్ ఆసుపత్రి వర్గాలు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరాని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్య బృందం ఎప్పటిప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. సిరివెన్నెల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామి కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి టాలీవుడ్‌లో దశాబ్ధాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం… అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించడం సిరివెన్నెల స్పెషాలిటీ.

More News

కిరణ్ అబ్బవరం నూతన చిత్రం ప్రారంభం

రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది.

ఓయూ: చెట్ల మధ్యలో 'సమాధి' కలకలం.. పరుగులు తీసిన విద్యార్ధులు

చదువుల తల్లి సరస్వతి దేవి నడయాడే విద్యా నిలయం.. ఎందరో విద్యార్ధులను దేశానికి అందించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సమాధి కలకలం రేపింది.

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత.. విషాదంలో టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. సోమవారం వేకువజామున గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు.

శివశంకర్ మాస్టర్ జాతకం చూసి జ్యోతిష్యుడు ఏమన్నాడో తెలుసా...?

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో నెటిజన్లు ఆయన గురించి ఇంటర్‌నెట్‌ను జల్లెడ పడుతున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్ రుణం తీర్చుకున్న సన్నీ.. రవి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చిన ఇంటి సభ్యులు

సండే ఫండే కావడంతో నాగార్జున ఎప్పటిలాగే ఇంటి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడించారు. ఇక సీజన్ ముగియడానికి మరికొద్దిరోజులే వుండటంతో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఇవ్వబోయే ప్రైజ్ మనీ డిటెయిల్స్ పంచుకున్నారు.