నిజంకాని సీ-ఓటర్‌ సర్వేలు.. పచ్చ తమ్ముళ్లను చూసి నవ్వుకుంటున్న జనాలు..

  • IndiaGlitz, [Friday,March 15 2024]

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీ ఓటర్ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమికి 18 ఎంపీ సీట్లు వస్తాయని.. వైసీపీ 7 స్థానాలకే పరిమితం కానుందని తెలిపింది. అంతే ఇక తెలుగు తమ్ముళ్లు తెగ రెచ్చిపోతున్నారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరంటూ సంకలు గుద్దుకుంటున్నారు.

అయితే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే సీ ఓటర్‌ చేసిన సర్వేలన్ని రివర్స్ అయ్యాయి. దీంతో ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత ఎలాంటిదో గుర్తించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సర్వేను అయినా నమ్మాలంటే ఆ సంస్థ ట్రాక్ రికార్డు ఓసారి పరిగణనలోకి తీసుకోవాలి. కానీ పచ్చ బ్యాచ్ ఇవేమీ పట్టించుకోకుండా ఎగిరెగిరిపడుతున్నారు. వాస్తవంగా సీ-ఓటర్ ట్రాక్‌ రికార్డు చూస్తే దానికి అంత సీన్‌ లేదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని.. 90 నుంచి 100 శాసనసభ స్థానాలు సాధిస్తుందని అభిప్రాయపడింది.

చివరకు ఫలితాలు ఎలా వన్ సైడ్‌గా వచ్చాయో అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో, 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించగా.. టీడీపీ కేవలం 3 లోక్‌సభ స్థానాలు, 23 శాసనసభ స్థానాలకు పరిమితమైంది. అంతేకాదు ఇటీవల 2023లో జరిగిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీ-ఓటర్‌ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 45 నుంచి 51 స్థానాలు వస్తాయని ప్రీపోల్‌ సర్వేలో తెలపగా.. 41 నుంచి 53 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడించింది. ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌కు 35 స్థానాలు, బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. అంటే ఆ సంస్థ చెప్పిన దానికి సీన్ రివర్స్ అయిందన్న మాట.

ఇక మధ్యప్రదేశ్‌లోనూ నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు 118 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలింది. ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో 113 నుంచి 137 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని తేల్చింది. కానీ బీజేపీకి 163 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌ 66 స్థానాలకే పరిమితమైంది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలన్ని తారుమారయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆ సర్వే విశ్వసనీయత ఏంటో అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి సంస్థ చేసిన సర్వేలు చూసి తెలుగు తమ్ముళ్లు సంబరిపడిపోవడం చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు. ఆ సంస్థ విశ్వసనీయత ప్రకారం ఏపీలోని ఫలితాల విషయంలోనూ లెక్కలు మారడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

More News

Sharmila: అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. గులాబీ నేతల్లో టెన్షన్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.

Mudragada: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

ఎట్టకేలకు కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ముద్రగడకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Election Schedule: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. కౌంట్‌డౌన్‌ షూరూ..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

Janasena: డల్లాస్‌లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. హాజరైన కూటమి నేతలు..

అమెరికాలోని డల్లాస్‌లో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ వేడుకలకు జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్‌కు చెందిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.