ఆ తల్లి ఆవేదనకు కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

పిల్లలు ఎటు వెళ్లొచ్చినా.. ఇంటికి రాగానే అమ్మ కోసమే వెదుక్కుంటారు. పెద్దవాళ్లైన తర్వాత కూడా దీనిలో మార్పైతే ఏమీ ఉండదు. పిల్లలు ఎంత పెద్దవారైనా సరే.. అమ్మ కంటికి మాత్రం ఎప్పుడూ చిన్నారుల్లాగే కనిపిస్తారు. దేశాలు మారొచ్చు.. సంస్కృతులు మారొచ్చు.. అమ్మ ప్రేమ మాత్రం మారదు. తాజాగా ఓ తల్లి వేదన ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తోంది. తాను మరణపు అంచున ఉన్నానని ఈ విషయాన్ని తన చిన్నారి కొడుక్కి అర్థమ్యేలా ఎలా చెప్పాలని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మ ఆవేదనకు నెటిజన్లు కన్నీళ్లు పెడుతుంటడం గమనార్హం.

కెనడాకు చెందిన న్యూరో సైంటిస్ట్‌ చౌదరి నాడియా అనే మహిళ అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతోంది. నేను త్వరలో క్యాన్సర్‌తో మరణిస్తానంటూ నాడియా చేసిన హృదయ విదారక ట్వీట్‌.. నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోంది. కాగా డాక్టర్‌ చౌదరి గత సంవత్సరం అన్యారోగ్యంగా ఉండటంతో జూన్‌ 2020న పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆమెకు అండాశయ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ విషయాలను బుధవారం ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

‘‘ఇక నేను ఎంతో కాలం జీవించను. ఈ రోజు ఆ విషయాన్ని నా కొడుక్కి చెప్పబోతున్నాను. ఇప్పుడు తనకు ఈ విషయం చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. ఈ మధ్యాహ్నం వరకూ నా కన్నీటిని పూర్తిగా బయటకు పంపించేసి తనకు విషయం చెప్పగలిగే ధైర్యం తెచ్చుంకుంటాను. అది నా కొడుకుని ఓదర్చడానికి సహాయపడుతుంది’’ అని ఆమె ట్వీట్ చేశారు. అలాగే తన కొడుకుతో ఉన్న ఫోటోను నాడియా పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు తమ కామెంట్లతో ఆమెకు ధైర్యం చెప్పేందుకు యత్నిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి తల్లీ మీకు మనోధైర్యాన్ని, బలాన్ని అందించాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More News

కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది.

టీఎన్నార్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి సాయం

ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి సాయం అందజేస్తున్నారు.

మరో క్రికెటర్‌కు సోనూసూద్ సాయం..

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను చిన్నారులకు కూడా వేసేందుకు లైన్ క్లియర్ అయింది.

వేణ్నీళ్ల స్నానంతో కరోనా రాదా?

కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రారంభమైతే అప్పటి నుంచి నివారణోపాయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.