close
Choose your channels

అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

Thursday, September 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు పుష్ప సినిమా యూనిట్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి అడవులను సందర్శించినట్లు ఆరోపణలు రావడంతో సమాచార హక్కు సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘పుష్ప’ సినిమా యూనిట్‌పై పోలీసులు ఫిర్యాదు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా కూడా అల్లు అర్జున్ సహా ‘పుష్ప’ సినిమా యూనిట్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిచి జలపాతాన్ని సందర్శించింది. దీంతో పాటు అనుమతులు లేకుండా.. తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని సమాచార హక్కు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్‌రాజు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

కాగా.. ఈ విషయమై ఆదిలాబాద్ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు సమాచార హక్కు సంఘం ప్రతినిధులు వెళ్లగా.. ఆయన అందుబాటులో లేరు. దీంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే బన్నీ మొదటి సారి గుబురు గడ్డం, మీసాలు.. పెరిగిన జుట్టుతో రగ్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.