close
Choose your channels

రోడ్డు ప్రమాదం: హీరో రాజశేఖర్‌పై కేసు నమోదు

Wednesday, November 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రోడ్డు ప్రమాదం: హీరో రాజశేఖర్‌పై కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న చిన్న గాయలతో హీరో బయటపడ్డారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వెంకటేష్ మాటల్లోనే..

‘మంగళవారం అర్ధరాత్రి 12:49 గంటలకు పెద్ద అంబేర్‌పేట్ ఓఆర్ఆర్‌పైకి రాజశేఖర్ కారు ఎంటరైంది. తెల్లవారు జామున 1: 20 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన కారు హీరో రాజశేఖర్‌దిగా మేం గుర్తించాము. ప్రమాదం జరిగిన వెంటనే అతను వేరే కారులో వెళ్లిపోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, అతివేగంతో కారు నడపడటంతో ప్రమాదానికి కారణమని మా దర్యాప్తులో తేలింది. సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేశాం. ఎలాంటి మద్యం బాటిళ్లు కారులో దొరకలేదు’ అని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

నాకు ఎలాంటి గాయాలు కాలేదు..

కాగా ఈ రోడ్డు ప్రమాదంపై రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు వెంటనే వారు నా ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు’ అని రోడ్డుప్రమాదంపై రాజశేఖర్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.