రోడ్డు ప్రమాదం: హీరో రాజశేఖర్‌పై కేసు నమోదు

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న చిన్న గాయలతో హీరో బయటపడ్డారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వెంకటేష్ మాటల్లోనే..

‘మంగళవారం అర్ధరాత్రి 12:49 గంటలకు పెద్ద అంబేర్‌పేట్ ఓఆర్ఆర్‌పైకి రాజశేఖర్ కారు ఎంటరైంది. తెల్లవారు జామున 1: 20 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన కారు హీరో రాజశేఖర్‌దిగా మేం గుర్తించాము. ప్రమాదం జరిగిన వెంటనే అతను వేరే కారులో వెళ్లిపోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, అతివేగంతో కారు నడపడటంతో ప్రమాదానికి కారణమని మా దర్యాప్తులో తేలింది. సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేశాం. ఎలాంటి మద్యం బాటిళ్లు కారులో దొరకలేదు’ అని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

నాకు ఎలాంటి గాయాలు కాలేదు..

కాగా ఈ రోడ్డు ప్రమాదంపై రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు వెంటనే వారు నా ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు’ అని రోడ్డుప్రమాదంపై రాజశేఖర్ వెల్లడించారు.

More News

పవన్‌కు కొత్తపేరు పెట్టిన ఏపీ మంత్రి!

ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ బోధన’ వ్యవహారాలు కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడంతో రెండు పార్టీల మధ్య ఈ వివాదం మరింత పెరిగింది.

త‌మిళంలోకి న‌వీన్ పొలిశెట్టి చిత్రం

న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన న‌వీన్ పొలిశెట్టి బాలీవుడ్‌లోనూ స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు. ఈ ఏడాది ఈయ‌న `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌`తో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

వ‌రుణ్ తండ్రిగా కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే

'జార్జ్‌రెడ్డి'.. పవన్, వరుణ్‌తో తీద్దామనుకున్నా కానీ...!

తెలుగులో వరస పెట్టి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బయోపిక్‌లకే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కూడా. ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి వెళ్లిపోగా..

జగన్.. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: పవన్ వార్నింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లిళ్లు, పిల్లలపై వైఎస్ జగన్ మాట్లాడటంతో ఇందుకు స్పందించిన పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.