'సాహో' నిర్మాత‌ల‌పై కేసు

  • IndiaGlitz, [Friday,October 18 2019]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సాహో'. యు.వి.క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లైంది. ఈ సినిమా సంస్థ‌ల‌పై మాదాపూర్ పోలీసుల‌కు జౌట్‌షైనీ అనే బ్యాగుల త‌యారీ కంపెనీ ఫిర్యాదు చేసింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం 'సాహో' సినిమాలోని హీరో, హీరోయిన్లు త‌మ కంపెనీ బ్యాగుల‌ను వాడిన‌ట్లుగా చూపిస్తామ‌ని, సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మయంలో ప్ర‌క‌ట‌న‌లిస్తామ‌ని చెప్పి నిర్మాత‌లు బెంగ‌ళూర్‌కి చెందిన ఔట్‌షైనీ అనే బ్యాగుల త‌యారీ సంస్థ నుండి 1కోటి 38 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేశార‌ట‌. అయితే సినిమాలో ఎలాంటి బ్యాగుల‌ను వాడ‌క‌పోగా, ఎలాంటి ప్ర‌చారం కూడా క‌ల్పించ‌లేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

'బాహుబ‌లి' సిరీస్‌తో ప్ర‌భాస్ స్థాయి అమాంతం పెరిగింది. లోక‌ల్ స్టార్ కాస్త నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. అందుకే.. పాన్ - ఇండియా అప్పీల్ ఉండేలా క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు ఈ హ్యాండ్స‌మ్ హీరో. తాజాగా 'సాహో'తో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు త‌న త‌దుప‌రి చిత్రం 'జాన్‌' (వ‌ర్కింగ్ టైటిల్‌) కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. 'జిల్‌' ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.