అయేషా మీరా హత్యకేసులో సీబీఐ దూకుడు.. రీ పోస్టుమార్టమ్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అయేషా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అభిప్రాయపడుతోంది.
మరోవైపు.. ఆయేషా తల్లి షంషాద్ బేగంను ఈ పోస్టుమార్టం విషయమై సీబీఐ సంప్రదించింది. ఇందుకు స్పందించిన షంషాద్.. న్యాయం జరుగుతుందంటే మళ్లీ పోస్ట్ మార్టం చేయడానికి అభ్యంతరం లేదని శంషాద్ బేగం, ఆమె తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. అయితే మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహిస్తే ముస్లిం పెద్దల నుంచి వ్యతిరేఖత లేకుండా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ఈ పోస్టుమార్టంలో ఏం తేలుతుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.