Indira Devi : మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూత.. చంద్రబాబు, నారా లోకేష్, ప్రముఖుల సంతాపం

  • IndiaGlitz, [Wednesday,September 28 2022]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇందిరా దేవి మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘‘ ప్రముఖ నటులు కృష్ణగారి సతీమణి, మహేశ్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి గారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసిక శక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

నారా లోకేష్:

‘‘ప్రముఖ నటులు, సూపర్‌స్టార్ కృష్ణగారి సతీమణి ఇందిరా దేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ :

కృష్ణ గారికి, మహేశ్ గారికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్:

మహేశ్ బాబు గారికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆయనకు ఇది పూడ్చలేని నష్టం. ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు , ముఖ్యంగా కృష్ణగారు ధైర్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము.

రవితేజ:

ఇందిరా దేవి గారి మరణవార్త బాధను కలిగించింది. కృష్ణగారికి, మహేశ్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.

మైత్రి మూవీ మేకర్స్:

శ్రీమతి ఇందిర గారి మరణం అందరినీ బాధించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు కృష్ణగారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. మహేశ్ గారు త్వరగా కోలుకోవాలి.

More News

Indira Devi : మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత.. చిరు, పవన్ , బాలయ్య సంతాపం

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణంతో టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.

Indira Devi: సూపర్‌స్టార్ కృష్ణ ఇంట్లో మరో విషాదం... మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూత

రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణం నుంచి ఇంకా కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.

Manchu Vishnu : మా ఫ్యామిలీపై ట్రోలింగ్ వెనుక ఆ హీరోనే.. 21 మందికి ఇదే పని : మంచు విష్ణు సంచలనం

టాలీవుడ్ హీరో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sena vs Sena Case : ఉద్ధవ్ థాక్రేకు షాకిచ్చిన సుప్రీం.. ఈసీకే అధికారం, సంబరాల్లో షిండే వర్గం

మహారాష్ట్రకు చెందిన ప్రాంతీయ పార్టీ శివసేనపై హక్కుల విషయంగా సీఎం ఏక్‌నాథ్ షిండే‌కు,

అక్టోబర్ 2న 'ఆదిపురుష్' టీజర్ విడుదల వేడుక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఆదిపురుష్".