పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. బాలుకు పద్మవిభూషణ్

తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2021కి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దానిలో ఐదుగురు తెలుగు వారికి పద్మాలు లభించడం విశేషం. అందులో తెలుగు జాతి గర్వించదగ్గ గాన గంధర్వుడు, వివిధ భాషల్లో దాదాపు 40వేల పాటలు ఆలపించిన సంగీతకారుడు.. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఉండటం మరింత విశేషం. ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ లభించడం తెలుగు జాతికి గర్వకారణం. ఇక గానకోకిల చిత్రకు పద్మభూషణ్‌ లభించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 120 మంది ప్రముఖులకు 119 పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అయితే గుజరాత్‌కు చెందిన ఇద్దరు కళాకారులకు కలిపి ఒకటే పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో మొత్తం అవార్డులు 119 అయ్యాయి.

మొత్తం 120 మందిలో ఏడుగురికి పద్మవిభూషణ్‌.. పది మందికి పద్మభూషణ్‌, 103 మందికి పద్మశ్రీ ప్రకటించింది. కాగా, ఈ జాబితాలో మొత్తం 29 మంది మహిళలు కాగా.. 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/భారత మూలాలున్న వ్యక్తులు/ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కేటగిరీ చెందిన వారు. కాగా.. బాలు, పాసవాన్‌ సహా 16 మందికి మరణానంతర పురస్కారాలు ప్రకటించారు. పద్మవిభూషణ్‌ పురస్కారాలు లభించిన వారిలో బాలుతోపాటు.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, వైద్య రంగంలో సేవలందించిన బెల్లె మోనప్ప హెగ్డే, నరీందర్‌ సింగ్‌ కపనీ (మరణానంతరం), మౌలానా వహీదుద్దీన్‌ ఖాన్‌ (ఆధ్యాత్మికం), బీబీ లాల్‌ (ఆర్కియాలజీ), సుదర్శన్‌ సాహు (ఆర్ట్‌) ఉన్నారు. పద్మభూషణ్‌ లభించిన 10 మందిలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌, కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ (మరణానంతరం), గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయి పటేల్‌ (మరణానంతరం), మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ప్రధాని కార్యాలయంలో గతంలో ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తదితరులు ఉన్నారు.

నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ..

పద్మశ్రీ పురస్కారాలు లభించిన 103 మందిలో నలుగురు తెలుగువారున్నారు. వారిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన ముగ్గురూ ఏపీకి చెందినవారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతీ రామమోహనరావు, అనంతపురానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త ఆశావాది ప్రకాశ్‌రావు ఉన్నారు.

More News

‘అన్నా రాంబాబుపై పోటీకి వెంగయ్య భార్యను నిలుపుతాం’

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

ఏపీ ఎస్‌ఈసీ మరో కీలక నిర్ణయం..

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ

అక్కినేని నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  అంటే అవున‌నే వార్త‌లు సినీ వ‌ర్గాల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

త‌లైవా ‘అణ్ణాత్తే’ రిలీజ్ డేట్ ఖ‌రారు

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ‘అణ్ణాతే’. శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ‘అణ్ణాతే’ సినిమాను నిర్మిస్తుంది.

సాయితేజ్‌, దేవ క‌ట్ట ...‘రిపబ్లిక్’

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్