రెండువేల నోటు రద్దుపై తేల్చేసిన కేంద్రం..

  • IndiaGlitz, [Tuesday,December 10 2019]

పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఈ ప్రభావంతో రెండు వేలు నోటు అంటే జనాలు ఒకింత భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రోజులుగా ఈ పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో జనాల్లో మరింత ఆందోళన పెరిగింది. మరోవైపు.. రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందనే పుకారు కూడా మొదలైంది.

మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం లేవనెత్తగా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ఈ ప్రచారం అంతా అబద్ధమే. పుకార్లు ఎవరూ నమ్మకండి. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు, నకిలీ నోట్లను తొలగించేందుకే గతంలో నోట్ల రద్దు చేశారంతే’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వడంతో దేశ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కాసింత ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.

More News

‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

మహేశ్ ఫ్యాన్స్‌కు రాజేంద్రప్రసాద్ గుడ్‌న్యూస్!

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న హీరోయిన్‌

తెలుగు, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో నటించడమే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్‌.

‘వైఎస్ జగన్ పారిపోయాడు.. నారా లోకేశ్ నిలబడ్డాడు!’

టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? ఏదో లాజిక్ మిస్సయ్యిందే అని అనుకుంటున్నారు కదా.. అదేం లేదండోయ్..

బాబు రౌడీ-ఎమ్మెల్యేలు ఎర్రగడ్డ నుంచి..: రోజా షాకింగ్ కామెంట్స్

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.