చైతు సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా..?

  • IndiaGlitz, [Monday,May 01 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'రారండోయ్ వేడుక చూద్దాం'. ఈ సినిమాను మే 19న విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అక్కినేని నాగార్జున తెలియ‌జేశారు. అయితే మే 19న ఇత‌ర చిత్రాల‌కు విడుద‌ల‌కు ఎక్కువ‌గా ఉండ‌టమే కాకుండా కొన్ని ఎపిసోడ్స్ ప‌ట్ల నాగార్జునకు సంతృప్తిగా అనిపించ‌లేదట‌. దాంతో రీ షూట్ చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌ను కోరాడ‌ట‌. క‌ళ్యాణ్ కృష్ణ ఇప్పుడు రీషూట్ ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట‌. దీంతో సినిమా విడుద‌ల అనుకున్న స‌మ‌యంలో కాకుండా జూన్ ప్ర‌థమార్థంలో రిలీజ్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మూడోస్థానంలో 'బాహుబలి -2'

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కనువిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ను సాధిస్తూ బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ముందుకు సాగిపోతుంది.

ఇంతకంటే ఇంకేం కావాలి - రాజమౌళి

రాజమౌళి ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడంటే ఎంతో ఆనందించదగ్గ విషయమే అయ్యుంటుంది. అదేంటంటే తలైవా, సూపర్స్టార్ రజనీకాంత్ అభినందనే కారణమట. బాహుబలి -2 సినిమాను చూసిన రజనీకాంత్ బాహుబలి సినిమా ఇండియన్ సినిమాకే గర్వకారణం.

పివి సింధు బయోపిక్...

గత ఏడాది ఓలింపిక్స్ లో భారతదేశానికి వెండి పతకాన్ని తెచ్చి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బయోపిక్ రూపొందనుంది. ఈ బయోపిక్ను నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ తెరకెక్కించనున్నాడు.

పూరి విగ్రహావిష్కరణ...

బ్రది సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన పూరి జగన్నాథ్ మాస్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేయడంలో తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. అందుకనే హీరోలందరూ పూరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు.

బాహుబలి దర్శక నిర్మాతలపై పిర్యాదు..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు కథ మాదంటూ వివాదాలు క్రియేట్ అవుతాయి. విడుదల తర్వాత మమ్మల్ని అగౌరవపరిచారంటూ కేసులు నమోదు అవుతుంటాయి.