గెలుస్తామని బాబుకు ధీమా... మరోవైపు భయం!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. సోమవారం నాడు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కోసం క్యూలో వుండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. ఎన్నికలు పూర్తయిన చోట్ల అభివృద్ధి కుంటుపడకుండా... ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పాలన సాగాలని.. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలివ్వాలని బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ధీమా ఓ వైపు.. మరోవైపు భయం..!
వెయ్యిశాతం గెలుస్తామని అంటూనే చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా కేంద్రం అడ్డుకుంటోందని బాబు అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా విజయం మనదేనని అభ్యర్థులకు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఓ వైపు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే బాబులో ఒకింత భయం మాత్రం కనిపిస్తోందని బాబు మాటలను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు, విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.