close
Choose your channels

జగన్, మోదీకి కంగ్రాట్స్.. తర్వాత మాట్లాడుతా!

Friday, May 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఫలితాల అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఫలితాలు ఎలా ఉన్నా... ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం బాధ్యతన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు మాటల్లోనే..

"టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు చంద్రబాబు ధన్యవాదములు.. శ్రేయోభిలాషులకు అభినందనలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష.. విశ్లేషించుకుంటాము. ఈవీఎంలపై నేను ఇప్పుడేమీ మాట్లాడను. ఇప్పుడేం మాట్లాడలేను.. తర్వాత విశ్లేషిస్తాము. ప్రజాస్వామ్యంలో ఫలితాలను గౌరవించడం అందరి బాధ్యత" అని మూడే మూడు ముక్కల్లో చంద్రబాబు ప్రెస్‌మీట్ ముగించేశారు. కాగా ప్రెస్‌మీట్‌కు ముందే చంద్రబాబు తన రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు పంపగా ఆయన ఆమోదించారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న విజయవాడలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.