'చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది' - పోసాని కృష్ణమురళి

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ప్రముఖ నటుడు, రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియా మీట్ నిర్వహించిన ఆయన చంద్రబాబుపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని టీడీపీ నేతలు, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కులపిచ్చి ఉందనీ, కులగజ్జి ఉందని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు.

కులపిచ్చి ఉందని చెబుతున్నా..!

చంద్రబాబుకు కులపిచ్చి ఉన్నట్లు నేను చెప్పకున్నా చెప్పినట్లు ఏబీఎన్ రాధాకృష్ణ వార్తలు రాశారు. ఇప్పుడు చంద్రబాబుకు కులపిచ్చి ఉందని నేను చెబుతున్నాను. ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు.. అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు(వీడియో క్లిప్ ప్లే చేసి చూపించారు). అంటే ఎస్టీ కులంలో, దళితులుగా పుట్టినవారు మనుషులు కాదా? కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా? నువ్వు కమ్మవాడివి కాబట్టి అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు. కర్మతో ఎవడైనా వెధవ అవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ స్పృహ కూడా చంద్రబాబుకు లేదా? అందుకే ఆయనకు కులపిచ్చి ఉందని చెప్పాను అని పోసాని ఏబీఎన్‌‌ రాధాకృష్ణ, చంద్రబాబుకు చురకలంటించారు.

నాన్నా కుటుంబా..!

నాన్నా కుటుంబరావూ.. అబద్ధం ఆడే బుద్ధి, వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే వున్నాయి. భారతదేశంలో ఆ పేటెంట్ హక్కులు మీ చంద్రబాబు నాయుడు గారికే ఉన్నాయి. అది మీరు తెలుసుకోవాలి.. అని కుటుంబారావుకు పోసాని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

నేను జగన్‌లా కాదు..?

ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని ఒకవేళ జగన్ అని ఉంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వార్త వచ్చేది. జగన్ కు మదం. అహంకారం. ఇతనిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టండి అని చెప్పేవాడివి కదా రాధాకృష్ణ అన్నా’ అని ఏబీఎన్ ఎండీకి పోసాని పంచ్ ఇచ్చారు. అంతేకాదు మీడియా బాషలో రాయలేని మాటలతో రాధాకృష్ణను పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పోసాని వ్యాఖ్యలపై ఏబీఎన్ ఎండీ, టీడీపీ నేతలు.. చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

 

 

More News

చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన పీవీపీ!

'ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్' అని విజయవాడ వైసీపీ అభ్యర్థి, ప్రముఖ బిజినెస్‌మెన్ పొట్లూరి వరప్రసాద్‌ మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో

జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు!

"క్రిమిన‌ల్ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే విశాఖ‌ప‌ట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయ‌న్ని నిల‌బెట్టాం. మాజీ జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు. వైసీపీని గెలిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా.

జనసేనదే ప్రభుత్వం.. సీఎంగా ప్రమాణం చేస్తా!

"2019లో జ‌న‌సేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మీరు కోరుకున్న వ్యక్తి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌బోతున్నారు"

మోదీ అంటే బాబు, జగన్‌కు భయం: పవన్

ప్రధాని మోదీ అంటే ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భయం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గాజువాక నియోజకవర్గానికి గాను

గాజువాకలో పవన్ నామినేషన్ దాఖలు

విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.