'చంద్రోదయం' లో చంద్రబాబు లుక్ విడుదల

  • IndiaGlitz, [Monday,September 24 2018]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనె ఓ దూరదృష్టి ఉన్న దార్శనికుడు. తనదైన విజన్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలకొని ,నేటి అమరావతి సమేత ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కే అనుక్షణం అంకురీత దీక్ష తో పనిచేస్తున్నారు.

ప్రజా నాయకుడిగా ఆయన తన మార్క్ పరిపాలనతొ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు‌. దానికి నిదర్శనమే ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం. ఈ శుభ తరుణంలో బాబు బయోపిక్ చంద్రోదయం లొ ఆయన పాత్ర లుక్ ను విడుదల చెస్తున్నారు.

చంద్రోదయం ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.వి.కె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారి పాత్రలొ నటిస్తొన్న వినొద్ నువ్వుల లుక్ ను విడుదల చెస్తున్నాము. చంద్రోదయం చిత్రీకరణ పూర్తయింది. నారా వారి పల్లె, తిరుపతి, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లొ షూటింగ్ చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లొ అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. అక్టోబరులో పాటలను, వెనువెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలొనె ఆయనొక అరుదైన , ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్దానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో చంద్రోదయం ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ చివరి దశలో ఉంది. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడన్నారు.

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్- మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి , నిర్మాత : జి.జె.వి.కె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

More News

అక్టోబర్ 12న రాజేంద్ర‌ప్ర‌సాద్ 'బేవ‌ర్స్' చిత్రం విడుద‌ల‌

'ఆన‌లుగురు', 'మీ శ్రేయాభిలాషి' లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి..

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో హీరో హీరోయిన్ల‌పై చివరి పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు.

'నువ్వెందుకు నచ్చావె శైలజ' చిత్రం ప్రారంభం

అనుపమ ఆర్ట్స్ పతాకం పై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.రామకృష్ణ నిర్మిస్తొన్న చిత్రం "నువ్వెందుకు నచ్చావె శైలజ". రోషన్, అనూష జంటగా నటిస్తున్నారు.

ఘంట‌శాల బ‌యోపిక్

అల‌నాటి మేటి గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు ఘంట‌శాల వెంక‌టేశ్వ‌ర‌రావు గురించి నేటి తరం యూత్ చాలా మంది వినే ఉంటారు.

రామ్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్‌...

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్నారు.