ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అన్ని విధాలుగా ఆదుకుంటామని, సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించారు.
స్టీల్ ప్లాంట్ లో మూడో ఫర్నెస్ ను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఫ్యాక్టరీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్లాంటు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, అదే టైమ్ లో సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు.
ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉండవల్లిలోని నివాసంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందంతో సీఎం చర్చించారు. విశాఖ ఉక్కుతో ఏపీ ప్రజలకు ఎమోషనల్ కనెక్ట్ ఉందని, ఈ అంశాన్ని మానవతా కోణంలో కూడా ఆలోచించాలని అన్నారు. అడిగిన వెంటనే సాయం చేసిన మోదీకి ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ, ఆర్ఎఎన్ఎల్ ఇంచార్జి సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com