సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
- IndiaGlitz, [Thursday,May 23 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని రీతిలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కనివీనీ ఎరుగని రీతిలో ఫ్యాన్ గాలి వీచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయ డంఖా మోగించారు.
దీంతో తన సీఎం పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు చంద్రబాబు లేఖ పంపారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ వెంటనే ఆమోదించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలంటూ చంద్రబాబుకు సూచించారు.
కాగా ప్రస్తుతం వైసీపీ 103 సీట్లు గెలిచి మరో 47 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ 13 స్థానాలు గెలిచి మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న తిరుపతి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.