సచివాలయ ప్రశ్నాపత్రాల లీకేజీపై చంద్రబాబు స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇవన్నీ వైఎస్ జగన్.. తన పార్టీ కార్యకర్తల కోసమని ప్రతిపక్ష పార్టీలు ఆది నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏకంగా గ్రామ సచివాలయ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని.. ఆ ప్రశ్నలు టైప్ చేసిన మహిళ.. వాళ్ల బంధువులకు లీక్ చేసిందని.. అందుకే ఆమెతో పాటు మరో ఇద్దరు దగ్గర బంధువులకు మంచి మార్కులు వచ్చాయని తెలుగులో ఓ ప్రధాన దినపత్రిక ఈ బాగోతాన్ని బట్టబయలు చేసింది. దీంతో సచివాలయ పరీక్షల్లో గూడూపుఠాణి నడించిందని, కొందరికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజీకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ వార్తలు వెలువడిన కొన్ని గంటలయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
చంద్రబాబు స్పందన..!
‘ఓ అవినీతిపరుడికి అధికారం ఇస్తే ఇంకా పెద్ద అవినీతి జరుగుతుందని జగన్ ప్రభుత్వం నిరూపించింది. నిన్నటికి నిన్న గ్రామ వాలంటీర్ పోస్టులన్నింటిని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుని నిరుద్యోగులను మోసం చేశారు. ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ల ఆశలను ఆవిరి చేశారు. ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసి భారీ స్కాంకు పాల్పడ్డారు. లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు. వారి భవితకు ఉరి వేశారు. ఏంటి తమాషాలా? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇలా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.