విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

'శివ‌పుత్రుడు', 'అప‌రిచితుడు' వంటి త‌మిళ అనువాదాల‌తో తెలుగులోనూ మార్కెట్‌ని పొందాడు విక్ర‌మ్‌. ప‌లు తెలుగు చిత్రాల్లో హీరోగా న‌టించిన‌ప్ప‌టికీ.. స్ట్ర‌యిట్ చిత్రాల కంటే అనువాదాల చిత్రాల‌తోనే విక్ర‌మ్‌కి ఇక్క‌డ గుర్తింపు ద‌క్కింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో వ‌చ్చిన 'ఐ', '10 ఎండ్ర‌త్తుకుల్ల' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో విక్ర‌మ్ త‌న త‌దుప‌రి చిత్రంపై బాగా ఫోక‌స్ పెట్టాడు.

అయితే.. ఊహించ‌ని రీతిలో ఈ సినిమాకి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొద‌ట‌గా నిర్మాత‌లు మారారు. త‌రువాత హీరోయిన్లు మారారు. ఇప్పుడేమో టైటిలే మారబోతోంది. 'మ‌ర్మ మ‌ణిద‌న్' పేరుతో వార్త‌ల్లోకి వ‌చ్చిన ఈ సినిమా .. ఇప్పుడు 'మారీశ‌న్' పేరుతో తెరకెక్క‌నుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విక్ర‌మ్ చేస్తున్న రెండు పాత్ర‌ల్లో ఒక పాత్ర‌.. రామాయ‌ణంలోని మారీచుడు పాత్ర‌ని పోలి ఉండే పాత్ర అని.. అందుకే చిత్ర యూనిట్ ఈ టైటిల్ ని కూడా ఆలోచిస్తుంద‌ని స‌మాచారం. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎన్నో మార్పుల‌కు గురవుతున్న ఈ సినిమా.. ఫ‌లితం ప‌రంగా విక్ర‌మ్‌కి క‌లిసిరావాల‌ని ఆశిద్దాం.

More News

పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".

తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మ‌స్తానీ'

ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావ్ మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్ ల్లో 'బెంగాల్ టైగర్' ప్రమోషన్స్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్

లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ డేట్ ఫిక్స్..

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది.ఈ చిత్రాన్ని దర్శకధీర రాజమౌళి శిష్యుడు జగదీష్ తెరకెక్కించారు.

ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే సినిమా 'తను నేను' - హీరో సంతోష్‌ శోభన్‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను సన్‌షైన్‌ సినిమాస్‌ బేనర్‌పై నిర్మించిన అభిరుచిగల నిర్మాత రామ్మోహన్‌ పి.