close
Choose your channels

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

Tuesday, April 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. నర్సింహా కూడా పలు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపునే సాధించాడు. అయితే నేడు అతనిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే కోటి రూపాయలను ఏకమొత్తంగా ఇవ్వలేదని.. 2017 నుంచి విడతల వారీగా తన వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్టు సదరు మహిల తన ఫిర్యాదులో పేర్కొంది.

డబ్బుల విషయం అడిగితే బెదిరింపులకు నర్సింహా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడమే కాకుండా సెక్సువల్ అభ్యూస్‌కు సైతం పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది. సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరుఫున మరో మహిళ రాయబారం నడిపిందని బాధితురాలు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు... నర్సింహారెడ్డితో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్‌కి తరలించారు.

యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు

కాకినాడకు చెందిన యాంకర్ శ్యామల నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో వీరి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం లభించలేదు. కొడుకు పుట్టిన తరువాత శ్యామల పెళ్లిని ఇంట్లో వాళ్లు అంగీకరించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారని.. విడాకులు తీసుకున్నారని రకరకాల రూమర్లు వచ్చాయి. వీటిపై తాజాగా శ్యామల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఈ ఫీల్డ్‌లో ఉంటే రూమర్లు వస్తూనే ఉంటాయని... అయితే కొన్నింటిపై స్పందించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. మనల్ని అభిమానించేవాళ్లు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుందని.. నర్సింహా, తాను కలిసే ఉన్నామని వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.