చిక్కుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్ ... చీటింగ్ కేసుపెట్టిన ఫైనాన్షియర్

  • IndiaGlitz, [Friday,March 11 2022]

టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనివాస్‌, ఆయ‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌లు చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఛీటింగ్ కేసు న‌మోదైంది. వి.ఎస్‌.శ్ర‌వ‌ణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఈరోజున సాయి శ్రీనివాస్‌, బెల్లంకొండ‌ సురేష్‌ల‌పై కేసు పెట్టారు. వీరిద్ద‌రూ 2018-19 మ‌ధ్య కాలంలో త‌న ద‌గ్గర నుంచి రూ.85 ల‌క్ష‌లు రుణంగా తీసుకున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన అకౌంట్ నుంచి చాలా మంది టెక్నీషియ‌న్స్‌కు నగదు ట్రాన్స్‌ఫ‌ర్ చేశార‌ని.. ఇప్పుడు బాకీ గురించి అడుగుతుంటే స‌రిగ్గా స్పందించ‌క పోగా.. త‌న‌ను బెదిరిస్తున్నార‌ని శ్ర‌వ‌ణ్ ఆరోపించాడు.

త‌న ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు తీసుకునే స‌మ‌యంలో త‌న‌ను సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా చేస్తాన‌ని చెప్పినట్లు ఆయన ఫిర్యాదులో తెలిపారు. శ్రవణ్ ఫిర్యాదుపై కేసును న‌మోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ కేసు విష‌య‌మై బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్ స్పందించాల్సి ఉంది.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా త్వ‌ర‌లోనే ఓ స్టార్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి పాన్ ఇండియా మూవీ చేయ‌బోతున్న‌ట్లు కూడా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేకపోయింది.

More News

ఆగస్టు 12న అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఏజెంట్' రిలీజ్

ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్.. ప్రభాస్‌తో పూజ ఏం చెప్పిందంటే..?

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదా ఆసుపత్రికి తరలింపు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శుక్రవారం వైద్య పరీక్షల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’