‘చెక్’ ట్రైలర్: ఏదీ కర్మను తప్పించుకోలేదు

  • IndiaGlitz, [Wednesday,February 03 2021]

‘భీష్మ’తో హిట్ కొట్టిన అనంతరం యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది.

ట్రైలర్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో నితిన్ ఒక ఉరిశిక్ష పడిన ఖైదీగా నటించినట్టు తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం జైలులోనే చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. అక్కడ చెస్‌లో తన ప్రతిభ చూపించడం.. జైలులో ఉన్న ప్రత్యర్థులను ఎదుర్కోవడం... రకుల్ సాయంతో కేసు నుంచి చెస్ ఆడి బయటపడటం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. మొత్తానికి విలన్స్‌కి చెక్ పెట్టి తనకు పడిన శిక్ష నుంచి నితిన్ ఎలా తప్పించుకున్నాడనేదే ‘చెక్’ కథ. ఇక దర్శకుడు ఈ కథను ఎంత ఆసక్తికరంగా మలిచారనేదే తెలియాల్సి ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే మాత్రం సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందనే అనిపిస్తోంది.

‘యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు’ అని మురళీ శర్మ వాయిస్‌తో మొదలైన ట్రైలర్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. జైల్లో మరో ఖైదీతో మొదలైన నితిన్ ‘చెక్’.. జాతీయ స్థాయికి వెళ్తుంది. ‘ఒక టెర్రరిస్ట్‌తో చెస్ ఆడిస్తారా’ అంటూ మరో చెస్ ప్లేయర్ అనడం వంటి అంశాలతో పాటు.. ప్రియా ప్రకాష్ వారియర్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా ట్రైలర్‌లో టచ్ చేశారు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More News

'వివాహ భోజనంబు'లో తొలి పాట 'ఎబిసిడి...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.

ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించిన నిమ్మగడ్డ.. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవకతవకలూ జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భారీగా చర్యలు చేపడుతోంది.

రాజేష్ టచ్‌రివర్ 'సైనైడ్'లో హాలీవుడ్ కథానాయిక తనిష్టా చటర్జీ

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'సైనైడ్'.

‘ఖిలాడి’లో అన‌సూయ‌..!

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ర‌వితేజ‌..

ఆ వార్త మనోవేదనకు గురి చేసింది: డైరెక్టర్ ఎస్.శంకర్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘యందిరన్‌’ (రోబో) కథ విషయంలో స్టార్‌ డైరెక్టర్ ఎస్‌. శంకర్‌పై ఒక అసత్య ప్రచారం జరిగింది.