మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తారు. ప్రధాని మోదీ అపాయింట్ ఆయనకు దొరికింది. ప్రధాని మోదీతో పాటు, హోం మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమౌతారు.
5వ తేదీ ఢిల్లీ పర్యటన ముగించుకొని, అదే రోజు రాత్రి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీన ఉదయం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు పాల్గొంచారు.
అదే రోజు విశాఖ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే ఉంటారు. 7వ తేదీన తిరిగి అమరావతి చేరుకుంటారు. అదే రోజున ఆయన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com