close
Choose your channels

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. చైనా రాకెట్ ముప్పు తప్పింది!

Sunday, May 9, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే గత కొద్ది రోజులుగా కొత్త భయం ప్రారంభమైంది. ఆ భయానికి ఇవాళ్టితో తెరపడింది. అది మరేదో కాదు చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5 బీ’. 18 టన్నుల ఈ రాకెట్ ఎక్కడ పడుతుందోనన్న ఊహాగానాలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టివేశాయి. దీని శకలాలు ఏ దేశంపై పడతాయో తెలియక ప్రపంచ దేశాలన్నీ భయాందోళనకు గురయ్యాయి. ఒకానొక దశలో ఢిల్లీపై కూడా పడతాయంటూ వార్తలొచ్చాయి. కాసేపటి క్రితం చైనా రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో కూలడంతో ప్రపంచమంతా ఊపిరి తీసుకుంది.

Also Read: ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకూ శకలాలు పూర్తిగా మండిపోయాయి. కేవలం చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడిపోయాయి. నేటి ఉదయం శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చింది. హిందూ మహా సముద్రంపై రాకెట్ భాగాలు విచ్ఛిన్నమయ్యాయన్న విషయాన్ని ముందే వెల్లడించింది. ఈ శకలాలన్నీ 72.47 డిగ్రీల తూర్పు రేశాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో కుప్పకూలాయి.

కాగా.. చైనా స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించ తలపెట్టింది. ఈ నిర్మాణ పనుల్లో భాగంగానే గతవారం ‘లాంగ్‌మార్చ్ 5 బీ’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్ మడ్యూల్‌ను విజయవంతంగానే ఈ రాకెట్ మోసుకెళ్లింది. కానీ ఆ తరువాత రాకెట్ నియంత్రణ కోల్పోయింది. దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పు ఉందని అంతరిక్ష రంగ నిపుణులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శకలాలన్నీ సముద్రంలోనే కూలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.