ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు యత్నిస్తున్నాయి: రాజ్‌నాథ్

ఇండో- చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్ ఓ ప్రకటన చేశారు. వీర జవాన్లకు అండగా యావత్‌ దేశం వెన్నంటి ఉందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. గాల్వాన్‌లో చైనా దురాక్రమణకు...కల్నల్‌ సంతోష్‌ నేతృత్వంలో మన సైనికులు ధీటైన జవాబిచ్చారని పేర్కొన్నారు. 20 మంది భారత జవాన్లు అమరులయ్యారన్నారు. లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందన్నారు. మొత్తం 90 వేల చదరపు అడుగుల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాజ్‌నాథ్ లోక్‌సభలో వెల్లడించారు.

చైనాతో సరిహద్దు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ లడ్డాఖ్‌ వెళ్లి సైనికులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తు చేశారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందన్నారు. సరిహద్దు నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదన్నారు.

ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలున్నాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నారు. చైనాతో భారత్‌ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందన్నారు. సరిహద్దుల విషయంలో భారత్ మంచి పరిష్కారం కోరుకుంటుంటోదన్నారు.సామరస్యపూర్వక చర్చలతోనే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు ప్రయత్నిస్తోందని.. అయితే భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత జవాన్ల సాహసానికి పార్లమెంట్‌ సెల్యూట్‌ చేస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని చైనా మోహరిస్తోందన్నారు.

భారత్‌ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోందన్నారు. సరిహద్దులను మార్చాలన్న చైనా కుతంత్రాన్ని మన సైన్యం తిప్పికొట్టిందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత బలగాలు దేశ గౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితుల్ని అయినా...ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

More News

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

సీక్రెట్‌ చెప్పేసిన చిరు..!!

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన.. మెగాభిమానులను ఆతృత కలిగించిన వార్తల్లో మెగాస్టార్‌ చిరంజీవి లుక్ ఒకటి.

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని

ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ

కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది

బిగ్‌బాస్‌లో అభి వర్సెస్ మొనాల్ వర్సెస్ అఖిల్.. ఇంట్రెస్టింగ్..

బిగ్‌బాస్‌లో ఇవాళ ప్రేక్షకులకు కావల్సినంత స్టఫ్ దొరికేసింది. ఇవాళ నర్మదా అదేనండీ.. మన మొనాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది.