close
Choose your channels

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన చిరంజీవి!

Friday, July 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన చిరంజీవి!

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో గురువారం నాడు హఠాన్మరణం చెందారు. అయితే శుక్రవారం నాడు సురేష్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలోని కాకినాడలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. కురసాల కుటుంబంతో మంచి సంబంధాలున్న మాజీ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. శుక్రవారం నాడు అంత్యక్రియలకు కొద్దిసేటికి ముందు కన్నబాబు ఇంటికి బయల్దేరి వెళ్లిన చిరు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే తిరుగుపయనం అయ్యారు. ఆ కొన్ని నిమిషాల్లోనే కన్నబాబును పరామర్శించిన చిరు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

క్షణాల్లోనే ఇలా వచ్చిన చిరు.. అలా వెళ్లిపోవడంతో కాసేపుంటే ఏమవుతుంది..? చిరు ఎందుకిలా చేశారు..? సరిగ్గా కన్ని నిమిషాల కూడా ఉండకపోవడం ఏంటి..? అని పలువురు కాకినాడ వాసులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏపీ రాజకీయాల్లో సైతం చిరు హాట్ టాపిక్ అయ్యారు. ఇదే కన్నబాబును పలుమార్ల ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పనవ్ కల్యాణ్ పేరు పెట్టి మరీ వార్నింగ్‌లు ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అన్నేమో కురసాలకు మంచి.. తమ్ముడేమో చెడ్డ..? అయినా చావుల దగ్గర ఈ పంచాయితేంటి..? మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కన్నబాబుకు చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కన్నబాబు కీలక నేతకు వ్యవహరించిన విషయం విదితమే. ఆ సాన్నిహిత్యంతోనే చిరు, కన్నబాబు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వెంటనే ఆయన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.