close
Choose your channels

రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన చిరు...

Saturday, December 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన చిరు...

వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి స్థానానికి ఎప్పుడూ లోటు రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న సమయంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ప్రజా జీవితంలో గడిపారు. ఆ సమయంలోనే ఆయన ఎన్నో సవాళ్లను.. ప్రతి సవాళ్లనూ.. ఆరోపణలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు.

అనంతరం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రంతో చిరు గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిరు తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిరు తాజాగా ఓ షోలో క్లారిటీ ఇచ్చారు. తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్టార్‌ హీరోయిన్‌ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్‌ జామ్‌' షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ షోలో చిరు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షోలోనే తన పొలిటికల్ రీఎంట్రీపై చిరు క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవి పాల్గొన్న షోని 'ఆహా' ఓటీటీ క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసింది. ఈ షోలో చిరంజీవి మాట్లాడుతూ.. పదేళ్లలో చాలా తెలుసుకున్నానని, పాలిటిక్స్‌ అసలు ఏమాత్రం తనకు సరిపడవని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని తెలిపిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని తెలిపారు. అలాగే మరో జన్మంటూ ఉంటే కూడా.. అప్పుడు కూడా నటుడిగానే ఉండాలని కోరుకుంటానని తెలిపారు. మొత్తానికి చిరు మాటలతో ఇక పొలిటికల్ ఎంట్రీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.