అర్బన్ మాంక్ లుక్‌.. ‘వేదాళం’లో ఆ పార్ట్ కోసమేనట.. చిరు క్లారిటి

ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అర్బన్ మాంక్‌ లుక్‌లో తొలిసారి చిరు అభిమానుల ముందుకు వచ్చారు. ఈ లుక్‌ని సైతం అభిమానులు బాగా ఇష్టపడ్డారు. అయితే అదెలా సాధ్యమైంది? ఫోటో షాప్‌లో చేశారా? లేదంటే నిజంగానే చిరు గుండు కొట్టించుకున్నారా? అంటూ చర్చలు మీద చర్చలు నడిచాయి. అయితే ఆ లుక్ ఎలా క్రియేట్ చేశారో వీడియోతో సహా పోస్ట్ చేసి అన్ని చర్చలకూ ఫుల్ స్టాప్ పెట్టారు.

అయితే ఈ లుక్ దేని కోసం ట్రై చేశారు? అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. కొందరు ‘ఆచార్య’ కోసమని భావిస్తుండగా మరి కొందరు ‘వేదాళం’ మూవీ కోసమేనని భావిస్తున్నారు కానీ ఏమూవీ కోసమనే దానిలో మాత్రం క్లారిటీ అయితే లేదు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆ లుక్ ‘ఆచార్య’ కోసం కాదు. ‘వేదాళం’ రీమేక్ కోసం చేసిన ట్రయల్ లుక్. అయితే ఆ లుక్ విషయంలో నేను ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. చాలా మంది జనాలు ఆ లుక్‌ని రజినీకాంత్ శివాజీ లుక్‌తో పోలుస్తున్నారు’’ అని చిరు తెలిపారు.

ఇక తన అర్బన్ మాంక్ లుక్ గురించి చిరు మాట్లాడుతూ.. ‘‘ఆ మేకప్ కోసం దాదాపు గంటన్నర సమయం తీసుకుంది. ఆర్టిఫిషియల్‌గా అనిపించే మేము ప్రోస్థెటిక్ మేకప్‌ను వాడాము. కానీ న్యూ టెక్నాలజీతో ఆ లుక్‌ను దగ్గర నుంచి చూసినప్పటికీ నిజమైన గుండు లాగే కనిపించేలా సెట్ చేశాం’’ అని చిరు వెల్లడించారు. ఇక మీదట ఇలాంటి లుక్ కావాలనుకునే నటులు గుండు కొట్టించుకోవాల్సిన పని లేదని.. న్యూ టెక్నాలజీతో సెట్ చేయొచ్చని చిరు తెలిపారు.

More News

రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యమివ్వండి: పవన్

అంతర్వేది లక్ష్మీనారసింహుని రథం దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్ సంస్థ

ఇండియన్స్‌కి యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో 'యాపిల్' సంస్థ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే ఈ సంస్థ ఆపరేషన్స్ ఇప్పటి వరకూ

'మేజ‌ర్‌'లో స‌ల్మాన్ హీరోయిన్‌

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి ముష్కరులను మట్టుబెట్టింది.

ఉర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను

వేస‌వి బ‌రిలో చిరు, బాల‌య్య‌..!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డబోతున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ అగ్ర క‌థానాయ‌కులు పోటీ ప‌డితే ఒక సంద‌ర్భంలో ఒక‌రిది పైచేయి