దోశ తిరగేసిన మెగాస్టార్..

మెగాస్టార్ ఏంటి.. దోశ తిరగేయడమేంటనుకుంటున్నారా? ఇది అక్షరాలా.. నిజం. ప్రముఖ ఓటీటీ 'ఆహా' కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'సామ్ జామ్'‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా సమంత మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ షోలో చిరు చేసిన సందడికి సంబంధించిన ప్రోమోలను ‘ఆహా’ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ షోకి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

అటు స్టార్ హీరో.. ఇటు స్టార్ హీరోయిన్.. ఇద్దరూ కలిసి షోని అదరగొట్టేశారు. బిగ్‌బాస్ ఫినాలే చూసిన వాళ్లందరికీ మెగాస్టార్ ఏ రేంజ్‌లో రచ్చ చేయగలరో అర్థమైపోయింది. స్పాంటీనియస్ పంచ్‌లతో అదరగొట్టేశారు. తాజాగా ‘సామ్ జామ్’ విడుదల చేసే షోలోను మెగాస్టార్ ఓ రేంజ్‌లో సందడి చేసినట్టు తెలుస్తోంది. తాజాగా షోకి సంబంధించిన పూర్తి ప్రోమో బయటకు వచ్చింది. సమంతతో కలిసి చిరంజీవి చేసిన సందడిని ప్రోమోలో చూపించారు. సమంత అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చిరు సమాధానాలిచ్చారు. కళ్లకు గంతలు కట్టుకుని దోశను తిరగేశారు. ఒక అంగవైకల్యమున్న బాబు గీసిన తన బొమ్మను చూసి ఫిదా అయిపోయారు.

More News

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' షోరీల్ విడుదల చేసిన రామ్ చరణ్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. డిసెంబర్ 25న ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'ను తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

డైరెక్ట‌ర్‌ని ఆకాశానికేత్తెస్తున్న ‘ఫిదా’ బ్యూటీ..!

తెలుగులో వరుణ్ తేజ్ ‘ఫిదా’తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన త‌మిళ బ్యూటీ సాయిప‌ల్ల‌వి .. ఇప్పుడు రానాతో ‘విరాట‌ప‌ర్వం’లో న‌టిస్తోంది.

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు క‌రోనా పాజిటివ్‌

నువ్వు సెల‌బ్రిటీవి అయితే నాకేంటి?  ఇక్క‌డ క‌రోనా వైర‌స్ .. అంటూ ఈ చైనా వైర‌స్ ఉధృతి పెంచుకుంటూనే ఉంది కానీ..

యూకే నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు..

కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని కాస్త ఫ్రీ అయిపోయిన జనాలకు కొత్తరకం వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ప్రమాదం స్థాయెంత?

ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపించిన టైటిల్స్.. ‘ప్రపంచమా ఊపిరి తీసుకో.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది’ అని.