వెండికాయిన్‌పై చిరు ప్రతిరూపం.. అభిమాని వినూత్న ప్రయోగం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంటే మామూలుగా ఉండరుగా.. ఆయనపై అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చాటుతూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చిరు ప్రతిరూపాన్ని వెండి కాయిన్‌పై చెక్కి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ACF)పై శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందిన జగదీష్ ముగడ అనే వ్యక్తికి అంతులేని అభిమానం. దీంతో తన అభిమానాన్ని చాటుకునేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశాడు.

జగదీష్ ముగడ స్వతహాగా మైక్రో ఆర్టిస్ట్. దీంతో ఆయన ఓ వెండి కాయిన్‌పై చిరు ప్రతిరూపాన్ని చెక్కారు. దీని కోసం 2.380 మిల్లీ గ్రాముల వెండి కాయిన్‌ను వినియోగించాడు. దీనిపై చిరు ప్రతి రూపాన్ని చెక్కేందుకు తనకు సుమారుగా 30 నిముషాలు సమయం పట్టినట్లు జగదీష్ తెలిపారు. విషయం తెలుసుకున్న అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ మండల అధ్యక్షుడు పవన్ కుమార్ తరుఫున ముగడ జగదీష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.