చిరు పాట‌.. మ‌రోసారి రీమిక్స్‌

  • IndiaGlitz, [Friday,December 29 2017]

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్.. ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడే హీరో. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించ‌గా ఈ సంవత్సరం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. కాని పట్టు వదలకుండా ఒకే ఎనర్జీతో సినిమాలను చేస్తున్న ఈ యంగ్‌ హీరో.. ప్రస్తుతం వి.వి.వినాయక్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం చిరంజీవి పాట‌ని రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రేయ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, సుప్రీమ్ చిత్రాల్లో ఇప్ప‌టికే చిరు పాట‌ల‌ను రీమిక్స్ చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఈసారి 'కొండవీటి దొంగ' సినిమాలో 'ఛమక్ ఛమక్ ఝాం' పాటను రీమిక్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

అప్పట్లో ఇళయరాజా స్వరపరచిన ఈ పాటలో చిరు, విజయశాంతి స్టెప్స్ కి మెగా ఫాన్స్ ఫిదా అయిపోయారు. మరి ఇప్పుడు 28 సంవత్సరాల తర్వాత రాబోతున్నఈ రీమిక్స్ కి త‌మన్ సంగీత సారధ్యంలో...సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెండితెరపై ఏ విధంగా ప్రేక్షకులని అలరిస్తారో చూడాలంటే...ఫిబ్రవరి 9 వరకు వేచి ఉండాల్సిందే.

More News

రెడ్ ఎఫ్ ఎం 'స్ప్రెడ్ ఏ స్మైల్' లో పాల్గొన్న భూమిక, నవదీప్

ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అభిమాన సూపర్ హిట్స్ 93.5 RED FM 'spead a smile' ద్వారా అవసరంలో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు పూయించడంలో తన ముఖ్యభూమికని కూడా పోషించింది.

ఎస్ ఎన్ ఆర్ట్స్ వారి 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్...

ఎస్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' హంట్ అనే కార్యక్రమన్ని ఎస్ ఎన్ చిన్నా మరియు శ్రీధర్ లు త్వరలో ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా నిర్వహించబోతున్నారు. శివశంకర్ మాస్టర్, ఉదయ భాను, ప్రీతి జింగానియాలు 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్ చేశారు.

శ్రీనివాస రెడ్డి హీరోగా జె.బి.మురళీకృష్ణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ'

'గీతాంజలి','జయమ్ము నిశ్చయమ్మురా' వంటి వైవిధ్యమైన సబ్జెక్టులతో కథానాయకుడిగా

'నీతో ఏదో చెప్పాలని ఉంది' సాంగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించనున్న ఆర్.పి.పట్నాయక్

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, 'జయం', 'నువ్వు-నేను', 'సంతోషం', 'మనసంతా',  'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్.

సుధీర్‌బాబు మూవీ టైటిల్‌..

సుధీర్‌బాబు, అదితిరావ్ హైద‌రీ జంట‌గా ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు చిత్ర‌కారుడి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంటే, అదితిరావ్ హైద‌రీ హీరోయిన్ పాత్ర‌లో ద‌ర్శ‌నమీయ‌నుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.