ఉక్రెయిన్ కు చిరు...

  • IndiaGlitz, [Tuesday,October 18 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టిస్తున్న చిత్ర‌మిది.

ఇప్ప‌టికి సినిమా 70 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం చిరు, ల‌క్ష్మీరాయ్‌లపై స్పెష‌ల్‌సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ త‌ర్వాత యూనిట్ ఉక్రెయిన్‌కు వెళుతుంది. అక్క‌డ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి యూనిట్ వ‌ర్గాలు స‌న్నాహాలు చేస్తున్నాయి.

More News

నవంబర్ 4 న విడుదల కానున్న 'ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి'

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి'చిత్రంతో కాళకేయ గా సినిమా ప్రేక్షకుల ప్రశంశలు పొందిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'..

డి.జె.దువ్వాడ జగన్నాథమ్ లేటెస్ట్ అప్ డేట్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె.దువ్వాడ జగన్నాథమ్.

మరోసారి నిర్మాతగా నేచురల్ స్టార్..!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారబోతున్నాడు.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ ఏం చేసారో చూడండి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే...ఈ షూటింగ్ గ్యాప్ లో మ‌హేష్ ఓ యాడ్ చేసాడు. ఇంత‌కీ మ‌హేష్ చేసిన యాడ్ ఏమిటంటే...అభి బ‌స్ యాడ్.