చిరూ.. ‘పునాదిరాళ్ల’కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని పట్టించుకోరూ..!

  • IndiaGlitz, [Friday,November 15 2019]

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు కొణిదెల చిరంజీవి. ఈయన ఇప్పటి వరకూ 151 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ.. కేరీర్ ప్రారంభం మాత్రం ‘పునాదిరాళ్లు’. చిరును ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి గూడపాటి రాజ్‌కుమార్. అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అంతేకాదు ఎవరు సాయం చేస్తారా..? అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. పాపం ఈ ‘పునాదిరాళ్లు’ కు వచ్చిన పుట్టెడు కష్టాన్ని తనకు హిట్టిచ్చి కెరీర్‌ను నిలబెట్టిన మెగాస్టార్ చిరంజీవి అయినా పట్టించుకోక పోతారా..? అని ఆయన ఎదురుచూపులు చూస్తున్నారు.

జీవితంలో అన్నీ విషాదాలే..!

గూడపాటి రాజ్‌కుమార్.. చిరుతో తెరెక్కించిన ‘పునాదిరాళ్లు’ చిత్రానికి ఒకట్రెండు కాదు ఏకంగా 5 నంది అవార్డులు దక్కించుకున్నారు. ఈయన తెరకెక్కించింది.. నిర్మించింది కొన్ని చిత్రాలే అయినా.. అన్ని సామాజిక ఇతివత్తాలన్న చిత్రాలే.. అయితే ఈయన పరిస్థితి ఆర్థికంగా చాలా అద్వాన్నంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే కుటుంబంలో వరుస విషాదాలు మరింత కుంగదీశాయి. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో.. సతీమణి కూడా కాలం చేయడంతో ఆయన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం రాజ్‌కుమార్ తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అంతేకాదు.. ఇప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదంటే పరిస్థితి అర్థం చేస్కోవచ్చు.

ఎదురుచూపులు!

తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ రాజ్‌కుమార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. కనీసం మందులకు కూడా డబ్బుల్లేని ధీనపరిస్థితిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి లాంటి పెద్దలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి సాయం చేస్తే బాగుంటుందని సినీ ప్రియులు, మెగాభిమానులు కోరుతున్నారు. మరి చిరూ పెద్ద మనసు చేసుకుని రాజ్‌కుమార్‌కు సాయం చేసి ఆదుకుంటారో..? లేకుంటే మనకెందుకులే అని మిన్నకుండిపోతారో తెలియాల్సి ఉంది.

More News

వంశీ వర్సెస్ లోకేష్.. ఆ వెబ్‌సైట్లతో నాకేంటి సంబంధం!?

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్.. బాబుకు అంత సీన్ లేదు!

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని

వశిష్ట నారాయణ్ సింగ్ అకాల మృతి బాధాకరం : హృతిక్

ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. నలభై ఏళ్లుగా మనోవైకల్యం (డిప్రెషన్స్‌)తో భాధపడుతున్న ఆయన నవంబర్-14న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

పూరి జగన్నాథ్ లాంచ్ చేసిన 'అప్పుడు-ఇప్పుడు' టీజర్

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.

'ఒరేయ్ ...బుజ్జిగా'లో కీల‌క పాత్ర‌లో హెబ్బాప‌టేల్‌

`ఏమైంది ఈ వేళ‌`, `అధినేత‌`, `బెంగాల్ టైగ‌ర్‌`, `పంతం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి `ఖైదీ` చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు