తల్లి పుట్టినరోజు సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్

అమ్మ అనే పదంలోనే కమ్మదనం ఉంది. అది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ తల్లి అంటే ఉండే మమకారం అంతా ఇంతా కాదు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘జన్మనిచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరు పెట్టిన పోస్ట్.. షేర్ చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరు పోస్టును అభిమానులు లైక్‌లతో ముంచెత్తుతున్నారు.

అంజనీ దేవి తన ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో ఉన్న ఫోటోలను ప్రముఖంగా.. అలాగే తన కూతుళ్లు మనవళ్లు, మనవరాళ్లతో చాలా ఆనందంగా ఉన్న ఫోటోలతో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఒక వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియోను చిరు ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తన తల్లిపై తనకున్న ప్రేమాభిమానాలను చిరు ఆ వీడియో ద్వారా వ్యక్తపరిచారు. మెగా అభిమానులు సైతం చిరు తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

More News

ఢిల్లీ : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది.

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ రిలీజ్ ఫిక్స్

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌..

ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్

పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్‌ ప్రసంగించారు.

రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు సహా ఆరుగురి దుర్మరణం

కూతురి పెళ్లిని ఎంతో ఆనందంగా.. ఘనంగా జరిపించాలనుకున్నారు. వచ్చే నెల 10వ తారీఖున క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిపించేందుకు ఇరువైపుల పెద్దలూ ముహూర్తం నిశ్చియించారు.