కేరళ సి.ఎం తో చిరు,నాగ్,సచిన్ మంతనాలు..

  • IndiaGlitz, [Wednesday,June 01 2016]

ఈరోజు ఉద‌యం తిరుప‌తిలో శ్రీనివాసుడిని చిరంజీవి, నాగార్జున‌, స‌చిన్ టెండూల్క‌ర్, అల్లు అర‌వింద్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ద‌ర్శించుకున్నారు. క్రికెట్, సినీ, వ్యాపార దిగ్గ‌జాలుగా ఎదిగిన వీరి సంయుక్త నేతృత్వంలో స‌రికొత్త ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు వీరి క‌ల‌యికకు కార‌ణం ఏమిటి అనే విష‌యం పై క్లారిటీ వ‌చ్చేసింది. వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం చిరంజీవి, నాగార్జున‌, స‌చిన్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ తిరువ‌నంత‌పురం వెళ్లి కేర‌ళ సి.ఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తో భేటీ అయ్యారు.
ఫుట్ బాల్ అకాడ‌మీ ఏర్పాటు పై కేర‌ళ ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. చిరంజీవి, నాగార్జున‌, అల్లు అర‌వింద్ కేర‌ళ బ్లాస్ట‌ర్స్ కు స‌హ య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యం పై నాగార్జున ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...మేము(చిరంజీవి, అల్లు అర‌వింద్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్) స‌చిన్ కేర‌ళ బ్లాస్ట‌ర్స్ తో క‌ల‌వ‌డం చాలా ఎక్సైటైడ్ గా ఫీల‌వుతున్నాం అంటూ సచిన్, చిరంజీవి, నాగార్జున‌, అల్లు అర‌వింద్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ఎల్లో డ్రెస్ లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసారు.ఈ విష‌యం పై సుమంత్, అల్లు శిరీష్ ట్విట్ట‌ర్ లో ...స‌చిన్ తో క‌లిసి కేర‌ళ బ్లాస్ట‌ర్స్ కో ఓన‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌ర్వంగా ఉంది అని స్పందించారు.

More News

జెనీలియాకు మళ్లీ కొడుకు పుట్టాడు..

సత్యం,సై,సాంబ,హ్యాపీ,బొమ్మరిల్లు,రెఢీ...తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కధానాయిక జెనీలియా.

రెండేళ్ళ కేసీఆర్ పాలన అద్భుతం : సుమన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ పాలనలో రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ శుభాకాంక్షలు తెలిపారు.

హీరో సూర్యపై కేసు నమోదు....

24చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సూర్య పై చెన్నైలో కేసు నమోదైంది.

న‌క్ష‌త్రంలోకి క‌న్న‌డ‌స్టార్‌..స్టార్ హీరోయిన్‌

ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌న్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌ర్వ‌లోనే మ‌రో తెలుగు సినిమాలో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

నవంబర్ లో పవన్, త్రివిక్రమ్ సినిమా...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతుండటంతో సినిమాల నుండి వైదొలగడానికి రెడీ అవుతున్నాడు.