టాలీవుడ్‌లో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,November 28 2021]

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న మాస్టర్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. కోవిడ్ బారినపడిన శివశంకర్ మాస్టర్ హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేరారు. అదే సమయంలో శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. పెద్ద కుమారుడు కూడా కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

దీంతో మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆయన వైద్య ఖర్చుల కోసం రోజుకు లక్ష రూపాయలు వరకు ఖర్చు అవుతుండటంతో సోనూసూద్, ధనుష్, చిరంజీవిలు వంటి వారు సాయం చేశారు కూడా. అయినప్పటికీ శివశంకర్ మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

More News

అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సేవాగుణం చాటుకున్న ఓవ‌ర్సీస్ డిస్ట్రిబూట‌ర్స్

మోస్ట్ అవేట‌డ్ మూవీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాల‌య్య అభిమానులు , ఓవ‌ర్సీస్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ హాస్స‌ట‌ల్ లో జ‌రుగుతున్న సేవాకార్య‌క్ర‌మాల‌కు అండ‌గా నిలిచారు.

ఇష్టపడి చేసిన సినిమా 'స్కైలాబ్‌'.... అందరూ కనెక్ట్ అవుతారు - నిత్యామీనన్‌

స్కైలాబ్‌ గురించి ఎవరిని అడిగినా చాలా కథలు చెబుతున్నారు. ఈ జనరేషన్‌ వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

బిగ్‌బాస్ 5 తెలుగులో వరుసగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్‌లో సందడికి భారీ ప్లాన్...?

కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు బిగ్‌బాస్‌ హోస్ట్స్‌ అందుబాటులో లేకపోతే..

టాలీవుడ్‌లో మరో విషాదం : దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు.