కరోనా బారినపడ్డ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. పరిస్థితి విషమం, సాయం కోసం కొడుకు విజ్ఞప్తి

  • IndiaGlitz, [Thursday,November 25 2021]

దేశంలో కరోనా కారణంగా ఎందరో సినీ నటీనటుడు, సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోగా.. ఇంకా పలువురు వైరస్ బారినపడుతున్నారు. నిన్న గాక మొన్న విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వచ్చిన ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్థారణ అయ్యింది. ఇక హిందీ టీవీ నటి మాధవి గోగటే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కూడా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శివశంకర్‌ మాస్టర్‌ ఇటీవల కరోనా బారిన పడడంతో ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. శివశంకర్‌ మాస్టర్‌ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని అంటున్నారు. మరోవైపు శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయనకు కూడా సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాచారం.

ఇక శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే స్తోమత తమ వద్ద లేదని అంటున్నారు అజయ్ కృష్ణ. శివశంకర్ మాస్టర్ దక్షిణాదిలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌ కొరియోగ్రఫికి గాను ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.

More News

జయలలిత మేనకోడలికే వేద నిలయం.. మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయానికి సంబంధించి మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది.

'జీ 5'లో 'రిపబ్లిక్' సినిమా చూడండి... మీ స్పందన తెలియజేయండి! - సాయి తేజ్

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'.

ఏపీ అసెంబ్లీ: టాలీవుడ్‌కి షాకిచ్చిన జగన్.. ఇకపై బెనిఫిట్ షోలు కట్, ఆన్‌లైన్‌లోనే టికెట్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే టాలీవుడ్‌కు షాకిచ్చారు.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ ఇదే.. !!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రెడీ అవుతున్న ‘‘పుష్ప’’.. ఇక ప్రమోషన్స్‌లో దూకుడే..!!!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.